- Advertisement -
హైదరాబాద్: పనిచేస్తున్న సంస్థకు ఓ వ్యక్తి టోకరా వేశాడు. తోటి ఉద్యోగుల పేరుతో డబ్బులు కాజేశాడు. సంస్థ ఫిర్యాదుతో కెపిహెచ్బి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… కెపిహెచ్బి కాలనీలోని అంకురా ఆస్పత్రిలో గుండాల సందీప్ బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. తనతోపాటు పనిచేస్తున్న ఉద్యోగుల యూజర్ ఐడిలు ఉపయోగించి సంస్థకు చెందిన రూ.9,67,513ను కాజేశాడు. ఈ విషయం ఆస్పత్రి యాజమాన్యానికి తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Man fraud in working company in Hyderabad
- Advertisement -