Thursday, May 2, 2024

WTC ఫైనల్: తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 217 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

సౌథాంప్టన్: ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌ లో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 217 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు 146/3 ఓవర్ నైట్ స్కోరుతో ఆట ప్రారంభమైన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(44), జెమిసన్ బౌలింగ్ లో ఎల్బిగా ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్(4) కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వైస్ కెప్టెన్ అజింక్యా రహానె(49), రవిచంద్రన్ అశ్విన్(22), ఇషాంత్ శర్మ(4), బుమ్రా(0), రవింద్ర జడేజా(15)లు ఔట్ కావడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరుకే పరిమితమైంది. న్యూజిలాండ్ బౌలర్లలో జెమిసన్ 5 వికెట్లతో చెలరేగగా.. ట్రెంట్ బౌల్ట్, వాగ్నర్ లు తలో రెండు వికెట్లు తీశారు.

WTC Final: India All Out at 217 against NZ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News