Thursday, May 2, 2024

బీహార్‌లో నాటుసారా తాగి మరో ఇద్దరి మృతి

- Advertisement -
- Advertisement -

Yet another hooch tragedy suspected in Bihar

ముజఫర్‌పూర్: నాటుసారా తాగి బీహార్‌లో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో, గత 15 రోజుల్లోనే నాటుసారా కాటుకు బలైనవారి సంఖ్య 40కి చేరింది. తాజా మరణాలు ముజఫర్‌పూర్ జిల్లా కాంతి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగాయని ఎస్‌ఎస్‌పి జయంత్‌కాంత్ తెలిపారు. మృతి చెందిన ఇద్దరు సిరాసియా గ్రామానికి చెందినవారు. మరో ఇద్దరు కూడా నాటుసారా తాగిన తర్వాత అస్వస్థకు గురి కావడంతో ఆస్పత్రిలో చేర్చారు. మృతదేహాల్ని శవపరీక్షకు పంపామని ఎస్‌ఎస్‌పి తెలిపారు. గ్రామస్థులు చెప్పిన వివరాల ప్రకారం బాధితులు నాటుసారా తాగినట్టు నిర్ధారణకొచ్చామన్నారు. తాజా ఘటన సరయి పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో జరిగింది. అక్టోబర్ చివరన ఆ ప్రాంతంలో నాటుసారా తాగి ఐదుగురు మరణించారు. ఆ ప్రాంతంలో నాటుసారా తయారీదారులపై దాడులు ప్రారంభించామని ఎస్‌ఎస్‌పి తెలిపారు. పశ్చిమచంపారన్, గోపాల్‌గంజ్, సమస్తిపూర్ జిల్లాల్లో ఇటీవల జరిగిన మరణాలతో కలిపి నాటుసారా మృతుల సంఖ్య 40కి చేరింది. బీహార్‌లో ఐదున్నరేళ్లుగా సంపూర్ణ మద్యనిషేధం అమలులో ఉన్నా నాటుసారాకు అడ్డుకట్ట వేయలేకపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News