Sunday, May 5, 2024

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

గీసుకొండ: వరంగల్‌ నర్సంపేట రహదారి మచ్చాపూర్ బస్టాండ్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నర్సంపేటలోని వల్లబ్‌నగర్ చెందిన ఎదరబోయిన రాజశేఖర్(27) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని బంధువులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. మృతుడు రాజేందర్ వరంగల్‌లో సెంట్రింగ్ పనులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై వేగంగా వస్తూ ఎదురుగా వస్తున్న వాహనం లైటు వెలుతురుకు మచ్చాపూర్ వద్ద పాన్ షాప్ సిమెంటు పోల్‌కు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. బాధితుడి తండ్రి లక్ష్మీనర్సు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు సీఐ సట్ల రాజు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News