Thursday, May 2, 2024

ప్రధాని పేరు చెప్పలేదని రెండో పెళ్లి చేసుకున్న వధువు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జరిగిన పెళ్లిని కాదని పెళ్లి కొడుకు తమ్ముడిని పెళ్లి కూతురు వివాహం చేసుకున్న సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఘాజీపుర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. జూను 11న శివశంకర్ అనే యువకుడితో రంజన అనే యువతి కి వివాహం జరిగింది. కాగా జూను 12న ఉదయం పెళ్లి కొడుకు ఇంట్లో ఓ కార్యక్రమం జరిగింది.

Also Read:  ఇంటిపై నిద్రించిన దంపతులు.. భార్య మృతి

ఆ సమయంలో శివశంకర్ తన బావమరిది, మరదలు తో మాట్లాడుతుండగా,మరదలు శివశంకర్ ని మన దేశ ప్రదాని ఎవరు అని అడగగా సమాధానం చెప్పలేకపోయాడు. దీంతో అక్కడ ఉన్నవారు, వధువు బంధువులు శివశంకర్ ని హేళన చేశారు. దీంతో అవమానంగా భావించిన వధువు శివశంకర్ తమ్ముడిని పెళ్లి చేసుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News