Wednesday, May 8, 2024

ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కోనరావుపేట : రాజన్న సిరిసిల్లా కోనరావుపేట మండలం అజ్మీరా తండాకు చెందిన అజ్మీరా భాస్కర్ (24) అనే యువకుడు కరీంనగర్ లో మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్టు గ్రామస్తులు తెలిపారు. అజ్మీరా రాంరెడ్డి, జయల కుమారుడు భాస్కర్ (24) గత కొన్ని నెలలుగా కరీంనగర్ లో పని చేస్తూ జీవనం గడుపుతున్నాడని తెలిపారు.

అయితే కుటుంబ సభ్యులకు తన కు మారుడు ఉరి వేసుకొని మరణించాడని సమాచారం తెలియడంతో కుటుంబసభ్యులు కరీంనగర్ వెళ్లారని భాస్కర్ మృతికి కారణా లు ఇంకా తెలియవని కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపారు. తాండలలో యువకులు వరుస ఆత్మహత్యలతో తాండవాసులు విషాదంలో మునిగిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News