- Advertisement -
దుబాయ్: ఐపీఎల్ 13వ సీజన్ లో భాగంగా జరుగుతున్న మరో ఆసక్తికర మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతూ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ముంబై జట్టు ఈ మ్యాచ్ లో గెలుపొంది అగ్రస్థానంలో నిలువాలని చూస్తోంది. మరోవైపు, పంజాబ్ జట్టు ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ప్రతీ మ్యాచ్లో గెలవాల్సిందే. దీంతో ఈ మ్యాచ్ లో ఎలాగైన విజయం సాధించి ప్లేఆఫ్ ఆశలు సజీవం చేసుకోవాలని పంజాబ్ భావిస్తోంది. మరి బలమైన ముంబైని ఓడించి పంజాబ్ రేసులో నిలుస్తోందో లేదో ఈ మ్యాచ్ తేలుస్తుంది.
IPL 2020: MI Win Toss and Opt Bowl against KXIP
- Advertisement -