Wednesday, May 1, 2024

పెంపుడు కుక్క దాడిలో వృద్ధురాలి మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో పెంపుడు కుక్క దాడిలో ఒక 82 ఏళ్ల వృద్ధురాలు మరణించారు. నగరంలోని ఖైసర్‌బాగ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం తన ఇంటి మిద్దె మీద సుశీలా త్రిపాఠి అనే రిటైర్డ్ స్కూలు టీచర్ ఉండగా ఆమె పెంపుడు కుక్క పిట్ బుల్ దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. రక్తపు మడుగులో పడి ఉన్న వృద్ధురాలిని చూసిన పనిమనిషి వెంటనే ఆమె కుమారుడికి ఈ విషయాన్ని తెలియచేసింది. వృద్ధురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపినట్లు పోలీసులు తెలిపారు. సుశీలా త్రిపాఠి తన చిన్న కుమారుడితో కలసి ఉంటున్నారు. ఆ కుటుంబంలో రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయి. ఆమెపై దాడి చేసిన పిట్ బుల్‌ను పెంచకోవడానికి వారి వద్ద లైసెన్స్ ఉందో లేదో నిర్ధారించుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. పిట్ బుల్ జాతి శునకాలు చాలా క్రూరంగా ఉంటాయని, శిక్షణ లేకుండా వాటిని ఇంట్లో పెంచుకోవడం ప్రమాదకరమని అధికారులు తెలిపారు.

Aged Woman dies after pet dog attack in Lucknow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News