Sunday, April 28, 2024

అలివేలుకు పదివేల దండాలు

- Advertisement -
- Advertisement -

ALIVELU

 

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ అనేకమంది మనసుని కదిలిస్తుంది. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న కష్టకాలంలో అనేక మంది తమకు తోచిన విధంగా పరులకు ఉపకారం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇలానే మంగళవారం హైదరాబాద్‌కు చెందిన అలివేలు తన పెద్ద మనసును చాటుకుంది. జియగుడాకు చెందిన ఆమె గత ఐదు సంవత్సరాలుగా జిహెచ్‌ఎంసిలో పారిశుద్ధ్య విభాగంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి పలువురు దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారు. ఈ తరహాలోనే అలివేలు కూడా ముందుకు వచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. పేదరాలే అయినప్పటికీ ఇతరులను కూడా ఆదుకోవాలన్న గొప్ప మనస్సున్న వ్యక్తిగా చాటుకున్నారు. ఆమె తనకు వచ్చే రూ.12వేల జీతంలోంచి పదివేలు తీసి మంత్రి కెటిఆర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది.

ఈ సందర్భంగా అలివేలు మంచి మనసుని మంత్రి కెటిఆర్ అభినందించి, ఆమెతో కాసేపు మాట్లాడారు. ఇంత తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఒక నెల జీతాన్ని కరొనా పోరు కోసం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన అలివేలును మంత్రి అభినందించారు. ఆమె పిల్లలు భర్త ఏం చేస్తారంటు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తన భర్త శ్రీశైలం కూరగాయల మార్కెట్ లో రోజువారి కూలీగా పని చేస్తారని, తన పిల్లలు చదువుకుంటున్నారని అలివేలు ఈ సందర్భంగా తెలిపింది. మీ కుటుంబానికి ఎప్పుడైనా తాను అండగా ఉంటానని, ఏదైనా సహాయం కావాలంటే చెప్పాలని అని మంత్రి కెటిఆర్ అన్నారు. అయితే తాను ఎలాంటి లాభాపేక్ష కానీ ప్రయోజనం కానీ ఆశించి ఈ విరాళం ఇవ్వడం లేదని కేవలం ఇతరులకు ఈ కష్టకాలంలో ఉపయోగపడాలన్న ఆలోచనతోనే ఇస్తున్నానని మంత్రికి సమాధానం ఇచ్చింది.

తాను నెల రోజుల వేతనాన్ని మొత్తం ఇస్తానని చెప్పగా అనేకమంది ఈ కష్టకాలంలో ఎందుకు ఇవ్వడం మీతో ఉంచుకోమని సూచించారన్నారు. అయితే తన భర్త శ్రీశైలం, తన పిల్లలు శివ ప్రసాద్, వందనలు తన ఆలోచనకు అండగా నిలిచారని ఆమె తెలిపింది. రెండో ఆలోచన లేకుండా తనకు తోచిన మేర సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన అలివేలు మంచి మనసు పట్ల మంత్రి అభినందనలు వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికురాలు గా ఒకవైపు కరొనా పోరులో ముందు వరుసలో ఉన్న అలివేలు, విరాళం సైతం ఇచ్చేందుకు ముందుకు రావడం ఆమె కాకుండా మొత్తం కరొనా పోరులో ముందువరుసలో నిలిచిన ప్రతి ఒక్కరికి మరింత గౌరవాన్ని అందిస్తుందని మంత్రి కెటిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News