- Advertisement -
హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. ఉప్పల్ సమీపంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు 104గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం…నైజీరియాకు చెందిన దంపతులు జుది, మౌనిక్ ముంబై నుంచి నగరానికి డ్రగ్స్ను తీసుకువస్తుండగా పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే వారి కోసం కాపు కాసి ఇద్దరిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 104గ్రామలు కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. వీరు నగరంలో ఎవరికి సరఫరా చేసేందుకు తీసుకువచ్చారో ఆరా తీస్తున్నారు. ఇప్పుడే తీసుకువచ్చారా లేదా గతంలో కూడా నగరంలోని వారికి సరఫరా చేశారా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
104 grams Cocaine seized in Hyderabad
- Advertisement -