అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. దీంతో రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా రికార్డు స్థాయిలో 5,041 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఇవాళ ఒక్కరోజే కరోనాతో 56మంది మరణించారని తెలిపింది. గడిచిన 24 గంటల్లో 1106మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 49,650కు చేరుకోగా.. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 642కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రిల్లో 26,118మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకొని 22,890మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 13 లక్షల 15వేలకుపైగా కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, ఇవాళ ఒక్కరోజే ఐదు వేలకుపైగా కేసులు, అత్యధిక మరణాలు నమోదుకావడం ఆందోళన కల్గిస్తోంది.
5041 New Corona Cases Registered in AP