Saturday, May 4, 2024

కుక్కలు కరిచాయని యాజమానిపై కేసు నమోదు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తనను జర్మన్ షఫర్డ్ కుక్కలు కరిచాయని ఓ వ్యక్తి పంజాగుట్ట పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని సోమాజిగూడకు చెందిన షేడ్ అహ్మద్‌హడి(51) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇంటి నుంచి శనివారం రాత్రి 11.30 నడుచుకుంటూ వెళ్తుండగా జయాగార్డెన్ సమీపంలో రెండు జర్మన్ షపర్డ్ కుక్కలు వచ్చి గయపరిచాయి. ఎడమ చేయి, తొడపై గాయపరిచాయి. ఈ ఘటనలో అతని ఎడమ చేయి విరిగింది. వెంటనే బాధితుడు ఈఎస్‌ఐ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. రోడ్డుపై వెళ్తున్న తనను కరిచి గాయపరిచాయని కుక్కల యజమానిపై చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Dogs attack Man after case file against pet owner 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News