Saturday, May 11, 2024

పిఓకెలో రోడ్డు ప్రమాదం.. 11మంది మృతి

- Advertisement -
- Advertisement -

Accident at an underground power station: One killed

ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీరులోని ముజఫరాబాద్‌లో శనివారం ప్రయాణికులతో వెళుతున్న ఒక వ్యాను అదుపు తప్పి కాలువలో పడిపోవడంతో ముగ్గురు పిల్లలతోసహా 11మంది మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. రావల్‌పిండ్ నుండి చకోతి సెక్టార్‌కు వెళుతుండగా వ్యాను ప్రమాదానికి గురైనట్లు పాకిస్తాన్ వార్తాసంస్థ ఎఆర్‌వై తెలిపింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని వార్తాసంస్థ తెలిపింది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు సంఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ఈ సంఘటనపై దర్యాప్తు జరపవలసిందిగా పాక్ ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది.

11 Died in Road Accident in POK

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News