- Advertisement -
గౌహతి : శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు తమ రాష్ట్రంలో 12 గంటల కర్ఫ్యూ అమలు చేస్తామని అస్సాం ఆరోగ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ తెలిపారు. ఈ నెల 28 అర్ధరాత్రి నుంచి కామ్రూప్(మెట్రో) జిల్లాలో 14 రోజులపాటు పూర్తి లాక్డౌన్ను అమలు చేస్తామని ఆయన తెలిపారు. గౌహతి కూడా ఈ జిల్లా పరిధిలోనే ఉన్నది. అస్సాంలో మొత్తం 6646 కరోనా కేసులు నమోదు కాగా, వీటిలో ఒక్క గౌహతిలోనే 762 ఉన్నాయి. వీరిలో 677 మందికి ఎక్కడా పర్యటించిన చరిత్ర లేదు. గౌహతీని ఈశాన్య రాష్ట్రాలకు గేట్వేగా భావిస్తారు. గురువారం ఒక్కరోజే అస్సాంలో 276 కేసులు నమోదు కాగా, వీటిలో 133 ఒక్క గౌహతిలోనే. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకూ 9మంది కరోనా వల్ల మరణించారు.
- Advertisement -