Friday, May 3, 2024

పాకిస్తాన్ లో ఘోర ప్రమాదం: 13 మంది మృతి

- Advertisement -
- Advertisement -

13 killed 32 injured in Pakistan road accident

 

ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దక్షిణ పాకిస్తాన్‌లోని హైవేపై గురువారం అతివేగంగా ప్రయాణించిన బస్సు బోల్తా పడి 13 మంది ప్రయాణికులు మృతి చెందగా, మరో 32మందికి తీవ్ర  గాయలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లోని సుక్కూర్ జిల్లాలో చోటుచేసుకుంది. బస్సు ప్రమాదం జరిగినప్పుడు కరాచీ నుండి వాయువ్యంలోని పెషావర్ వరకు ప్రయాణిస్తున్నట్లు పోలీసు అధికారి నదీమ్ అహ్మద్ తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అహ్మద్ తెలిపారు. గాయపడిన వారిలో డ్రైవర్ కూడా ఉన్నాడు. రహదారి మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం, ట్రాఫిక్ చట్టాలను పట్టించుకోకపోవడం వల్ల పాకిస్తాన్‌లో ఘోరమైన ప్రమాదాలు సర్వసాధారణమని అధికారులు చెబుతున్నారు.

13 killed 32 injured in Pakistan road accident

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News