Sunday, May 5, 2024

అన్నదమ్ముల మధ్య గొడవ.. ఆపేందుకు వెళ్లిన మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

woman went to stop altercation and died in rangareddy

రంగారెడ్డి: అన్నదమ్ముల మధ్య గొడవ ఆపేందుకు వెళ్లి మహిళ మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిలలో బుధవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే… నిన్న అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో బంధువు అయిన మహిల గొడవను ఆపేందుకు వెళ్లింది. మహిళపై పెంటయ్య కుమారుడు దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిని ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలు లావణ్య 5 నెలల గర్భిణిగా ఉందని స్థానికులు చెబుతున్నారు. మృతురాలి కుటుంబీకుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తుచేస్తున్నారు.

woman went to stop altercation and died in rangareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News