- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 2,22,111కి చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,436 కోవిడ్-19 కేసులు, 6 మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో 2,154 మంది బాధితులు కోలుకున్నారు. ఈ వైరస్ మహమ్మారి బారినపడి 1,271 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు కరోనా నుంచి 1,98,790 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,050 యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 18,279 మంది బాధితులు హోం ఐసొలేషన్ లో చికిత్స పొందుతున్నట్టు రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. హైదరాబాద్ లో 249, రంగారెడ్డిలో 110, మేడ్చల్ లో 105 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
1436 New Covid-19 Cases Reported in Telangana
- Advertisement -