- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,446 కేసులు, 8మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. అదే సమయంలో 1,918 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,16,238కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,91,269 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా…. ప్రస్తుతం 23,728 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 1,241మంది కరోనాతో మృతి చెందారు. 19,413 మంది హోం క్వాంరంటైన్ లో చికిత్స పొందుతున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. కొత్తగా హైదరాబాద్ లో 252, రంగారెడ్డిలో 135, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 131 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
1446 new covid 19 cases reported in telangana
- Advertisement -