Sunday, May 5, 2024

భారీ వర్షాలపై మంత్రి కెటిఆర్ సమీక్ష

- Advertisement -
- Advertisement -

Minister KTR teleconference on heavy rains

హైదరాబాద్: నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై మంత్రి కెటిఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బుధవారం ఉదయమే జిహెచ్ఎంసి కార్యాలయానికి చేరుకున్న కెటిఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో పాటు పురపాలక శాఖ విభాగాల అధిపతులు, హైదరాబాద్, మేడ్చల్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్లలతో కలిసి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్, డిప్యూటీ స్పీకర్ బాబా ఫసీయుద్దీన్ కూడా ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ… జిహెచ్ఎంసిలో ప్రస్తుతమున్న అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉండాలని కెటిఆర్ ఆదేశించారు. జిహెచ్ఎంసి మేయర్, ఎంఎల్ఎలు అందరూ క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించాలని చెప్పారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లకు తరలించాలని సూచించారు. వరద బాధితులకు ఆహారం, అవసరమైన దుప్పట్లు వైద్య సదుపాయం కల్పించాలని ఆదేశించారు. ఇలాంటి క్యాంపుల్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. తక్షణమే విద్యుత్ సరఫరాను పునరుద్దరించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. హియాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ నీరు విడుదల కారణంగా అప్రమత్తంగా ఉండాలని కెటిఆర్ కోరారు. మూసీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రహదారులపై నిలిచిన నీటిని తొలగించేందుకు వెంటనే చర్యలు చేేపట్టాలన్నారు. మ్యాన్ హోళ్లు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు సురక్షితంగా ఉండాలని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News