Tuesday, May 7, 2024

రాష్ట్రంలో కొత్తగా 153 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

153 new covid cases reported in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 36,570 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 153 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. మంగళవారం నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,74,845 పెరిగింది. తాజాగా 157 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 6,67,328 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 3,984కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.88 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,533 యాక్టివ్ కేసులున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News