Sunday, April 28, 2024

45 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

- Advertisement -
- Advertisement -

1602 new covid-19 cases reported in telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 45 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,47,284 మందికి పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాబోయే రోజుల్లో మరింత రెట్టింపు స్థాయిలో పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా గురువారం 46,970 మందికి టెస్టులు చేయగా 1602 పాజిటివ్‌లు తేలాయి.

వీటిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 295 మంది ఉండగా, ఆదిలాబాద్‌లో 17, భద్రాద్రి 77,జగిత్యాల 39, జనగాం 17, భూపాలపల్లి 23, గద్వాల 11, కామారెడ్డి 28, కరీంనగర్ 76 ,ఖమ్మం 79, ఆసిఫాబాద్ 13, మహబూబ్‌నగర్ 32,మహబూబాబాద్ 19, మంచిర్యాల 39, మెదక్ 21, మేడ్చల్ మల్కాజ్‌గిరి 137, ములుగు 43, నాగర్‌కర్నూల్ 47, నల్గొండ 79, నారాయణపేట్ 1, నిర్మల్ 12, నిజామాబాద్ 33, పెద్దపల్లి 46, సిరిసిల్లా 27, రంగారెడ్డి 118, సంగారెడ్డి 40, సిద్ధిపేట్ 38, సూర్యాపేట్ 45, వికారాబాద్ 18, వనపర్తి 24, వరంగల్ రూరల్ 26, వరంగల్ అర్బన్ లో 49, యాదాద్రిలో మరో 33 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,47,284కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,26,646కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

హాస్పిటల్‌లో 2750 మందికి చికిత్స….

కరోనా వైరస్ సోకిన వారిలో ప్రస్తుతం కేవలం 2750 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారని ఆరోగ్యశాఖ పేర్కొంది. మిగతా వారంతా హోం ఐసోలేషన్‌కే పరిమితమయ్యారని అధికారులు తెలిపారు. అంటే మన రాష్ట్రంలో వైరస్ తీవ్రత అతి తక్కువగా ఉందని హెల్త్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. అదే విధంగా ఇప్పటి వరకు 2,47,284 మందికి వైరస్ సోకగా, వీరిలో ఇప్పటికే 2,26,646 మంది ఆరోగ్యవంతులుగా మారినట్లు ఆరోగ్యశాఖ నివేదించింది. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన చికిత్సను అందించడం వలనే తెలంగాణలో వేగంగా కోలుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. దీంతో రికవరీ రేట్ ఏకంగా 91.65 చేరిందని హెల్త్ డైరెక్టర్ వివరించారు.

98 శాతం ప్రభుత్వం ఆధీనంలోనే టెస్టులు….

రాష్ట్రంలో వైరస్ నిర్ధారణ కోసం ప్రతి రోజూ చేసే టెస్టుల్లో 98 శాతం ప్రభుత్వం ఆధీనంలోనే నిర్వహిస్తున్నట్లు వైద్యశాఖ పేర్కొంది. వీటిలో ఏకంగా 44 శాతం మందికి ప్రైమరీ, 12 శాతం సెకండరీ కాంటాక్ట్‌లకూ టెస్టులను చేస్తున్నట్లు డైరెక్టర్ బులెటెన్‌లో నివేదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News