Sunday, April 28, 2024

రాష్ట్రంలో 177 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

177 new covid cases reported in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 38,219 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 177 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 93 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 16 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 190 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,80,251 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,72,637 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,596 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,018కి పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News