Saturday, April 27, 2024

ఎపిలో 135 కేసులు

- Advertisement -
- Advertisement -

135 new covid cases reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31, 158 శాంపిల్స్ పరీక్షించగా 135 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ముగ్గురు కరోనా బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 164 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,10,98,568 కు చేరుకోగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,76,212 కు పెరిగింది. ఈక్రమంలో 20,60,400 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా 14,486 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 1,326 గా ఉన్నాయని ఎపి ప్రభుత్వం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News