- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1,983 కోవిడ్-19 కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో 2,381 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,02,594కి చేరింది. రాష్ట్రంలో కరోనాతో 1,181మంది మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు 1,74,769 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 26,644 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 21,784 మంది బాధితులు హోం ఐసొలేషన్ లో చికిత్స పొందుతున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. కొత్తగా హైదరాబాద్ లో 292, రంగారెడ్డిలో 187, మేడ్చల్ లో 145, ఖమ్మంలో 117, కరీంనగర్ లో 109, నల్గొండలో 105, సిద్దిపేటలో 89 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
1983 new corona cases Reported in Telangana
- Advertisement -