Sunday, April 28, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ బంగారాన్ని సోమవారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి శంషాబాద్ వచ్చిన పాతబస్తీకి చెందిన ఇద్దరు ప్రయాణికులను పక్కా సమాచారంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు. ఈక్రమంలో వారి నుంచి రూ.1.2 కోట్లు విలువైన 2.4 కిలోల బరువు కలిగిన 21 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ శివకృష్ణ తెలిపారు. బంగారు బిస్కెట్లను ప్యాంటు జేబుల్లో పెట్టుకుని తెచ్చినట్లు వివరించారు. ఇద్దరు ప్రయాణికులపై వేర్వేరుగా రెండు కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. బంగారం స్మగ్లింగ్ చేసేందుకే హైదరాబాద్ నుంచి వారు దుబాయ్ వెళ్లినట్లు అనుమానిస్తున్న కస్టమ్స్ అధికారులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.గతంలోనూ వీరిపై బంగారం తరలింపు కేసులు ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు అనుమానిస్తున్నారు.

2.4 kgs Gold Seized at Shamshabad Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News