Monday, May 6, 2024

సందేహమే అక్కర్లేదు.. అత్యంత బలహీన ప్రధాని మోడీనే: అసద్

- Advertisement -
- Advertisement -

Owaisi criticized Modi as weakest PM of India

 

మన తెలంగాణ/హైదరాబాద్ : చైనాను నిలువరించడంలో మోడీ విఫలం అయ్యారని, ప్రధాని హోదాలో ఉండి అత్యంత ఉదాసీనంగా వ్యవహరించిన ఆయనను ఏమాత్రం క్షమించలేమని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసి వ్యాఖ్యానించారు. భారత సరిహద్దు ప్రాంతాల్లో చైనా దురాక్రమణలు అంశంపై ఒవైసి స్పందించారు. మన భూభాగాన్ని చైనా ఆక్రమిస్తుంటే ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సందేహమే అక్కర్లేదని, అత్యంత బలహీన భారత ప్రధాని నరేంద్ర మోడీనే అని ఒవైసి విమర్శించారు. కఠిన పదజాలంతో కూడిన సుదీర్ఘ ప్రసంగాలు చైనాను కట్టడి చేయవచ్చని ఆయన భావిస్తున్నట్టుంది అని ఎద్దేవా చేశారు. భారతదేశ ఘనత, ప్రతిష్ట, జాతీయ భద్రతకు ఇంత సుదీర్ఘకాలం పాటు మరే ప్రధాని కూడా నష్టం కలిగించిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. మీడియాలో వచ్చిన ఓ కథనంపై స్పందిస్తూ ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News