- Advertisement -
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని ఉన్నావో ప్రాంతంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి బహ్రైచ్ వెళ్తున్న బస్సు బోల్తాపడడంతో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 82 మంది ప్రయాణికులు ఉన్నారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా క్రేన్ సహాయంతో బస్సును పక్కకు తొలగించారు.
- Advertisement -