- Advertisement -
ఢిల్లీ: భారత్లో కరోనా తగ్గినట్టే తగ్గి విస్తరిస్తోంది. గత కొన్ని రోజులు 40 వేల లోపు వచ్చిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఢిల్లీ, కేరళ, మహారాష్ట్రలో ఇవాళ ఐదు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కానీ ఢిల్లీలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 45,209 కొత్త కేసులు నమోదుకాగా 501 మంది మృత్యువాతపడ్డారు. ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 90.95 లక్షలకు చేరుకోగా 1.33 లక్షల మంది చనిపోయారు. కరోనా వ్యాధి నుంచి 85.21 లక్షల మంది కోలుకోగా 4.4 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. భారత్లో టెస్టుల సంఖ్య 13.2 కోట్లకు చేరుకుందని ఐసిఎంఆర్ ప్రకటించింది. ప్రతి పది మందిలో ఒకరికి కరోనా టెస్టు చేశారు.
- Advertisement -