Sunday, June 16, 2024

ఖరీఫ్ నుంచే పంటల బీమా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీ జన్‌నుంచే పంటల బీమా పధకాన్ని అమలు చేయనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రైతుల పక్షాన ప్రభుత్వమే పంటలబీమా రూ.3వేల కోట్లు ప్రీమియం చెల్లించనుందని తెలిపారు.గతంతో పోలిస్తే ముందస్తుగానే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసామని, ఐకేపీ సెంటర్ల పెంపు గత ఏడాదితో పోలిస్తే నాలు గు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేశామన్నారు. ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు జిల్లాకొక ఐఏఎస్‌ను నియమించి ఎప్పటికప్పుడు సమీక్ష చేయిస్తున్నామని వెల్లడించారు.ధాన్యం విక్రయాల్లో తరుగు, తా లుపేరుతో కోతలు లేవని, గతంలో ప్రతి క్వింటాకు 7 నుంచి 10 కేజీల వరకు తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ చే శారని, ఈ దఫా మిల్లర్ల దోపిడీపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపడంతో కోతలకు మిల్లర్ల  స్వస్తి చెప్పరని ,

దీంతో ప్రతి కింటా పై రైతుకు 150 నుంచి 200 రూపాయల వరకు అదనపు లబ్ధి చేకూర్చగలిగామని మంత్రి వివరించారు. రైతులు పంట అమ్ముకున్న ఐదు రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు వేస్తున్నామని, గతంలో 45 రోజులు పట్టేదన్నారు. రైతు ఎంతో వడ్డీ నష్ట పోయేవాడన్నారు. కానీ ఇప్పుడు కేవలం 5 రోజుల్లోనే రైతు ఖాతాల్లో నగదు జమ అవుతుందని, దీంతో రైతుకు వడ్డీ వ్యాపారుల వేధింపులు లేవని, వడ్డీలు కట్టాల్సిన అవసరం లేదన్నారు.కెసిఆర్ ప్రభుత్వంలో ఫసల్ బీమా యోజన లేదని, ఉంటే కనీసం పంట నష్టపరిహారం వచ్చేదన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్, రైతు ప్రభుత్వం కాబట్టి పంట నష్టపోయిన రైతాంగానికి పంట నష్టపరిహారాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అందిస్తోందన్నారు. అంతే గాక, ఇక ముందు ఏ ఒక్క రైతు కూడా ఇలా నష్టపోకుండా, ప్రభుత్వమే రైతుల ప్రీమియం చెల్లించి పంట భీమా పథకం కోసం ప్రభుత్వమే ౩వేల కోట్ల రూపాయలు వెచ్చించి వానాకాలం నుండిఈ పధకాన్ని అమలు చేస్తుందని వెల్లడించారు.

తడిచిన ధాన్యాన్ని సైతం ఈ ప్రభుత్వం సేకరిస్తుందని, గతంలో కల్లాల్లో వరికుప్పలమీద రైతులు గుండె పగిలి చనిపోయారని, కానీ తమది రైతు ప్రభుత్వం అని తెలిసి రైతులు గుండె ధైర్యంతో బతుకుతున్నారన్నారు. తెలంగాణలో సన్న వడ్ల సాగును పెంచేందుకు 500 బోనస్‌అమలు చేస్తామన్నారు. తెలంగాణలో దొడ్డు వడ్లు తినడం చాలా తగ్గిపోయిందన్నారు. గత ప్రభుత్వంలో సన్న బియ్యం పేరుతోటి దొడ్డు వడ్లనే పాలిష్ చేసి అంగన్వాడీలకు, మధ్యాహ్న భోజన పథకానికి వినియోగించేవారని తెలిపారు. అలా కాకుండా పేదలు కూడా పెద్దోళ్లు తినే సన్న బియ్యం తినాలనే సంకల్పంతో రేషన్ దుకాణాల్లో కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని పెట్టుకుందన్నారు. కానీ ఇతర రాష్ట్రాల నుంచి సన్నబియాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. అందుకే మనం దొడ్డు వడ్లు అమ్ముకొనుడెంది, సన్న వడ్లు కొనుక్కునుడేంది మనమే మనకు అవసరమైనంత సన్న వడ్లను ఉత్పత్తి చేసుకునేందుకు ఈ బోనస్ పథకాన్ని ప్రవేశపెట్టామని వివరించారు. నాట్లేసుకునే సమయం దగ్గర పడుతుంది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ స్కీమును ప్రవేశపెట్టామన్నారు. భవిష్యత్తులో దొడ్డు వడ్లకు కూడా ఈ స్కీములు వర్తింప చేస్తామని ప్రకటించారు.

దొడ్డు వడ్లకు 500 రూపాయలు ఇప్పుడు ఇవ్వలేకపోయినా,మూడు నుంచి ఐదు రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తూ, మిల్లర్ల ధాన్యం కోతను అరికడుతూ.. ప్రత్యక్షంగా అంతమేరా రైతుకు ఈ ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోందన్నారు. అది తెలుసు కనుకనే తెలంగాణ రైతులు నిశ్చింతగా ఉన్నట్టు తెలిపారు. రైతులను కాల్చుకుతిన్న టిఆర్‌ఎస్ అగ్ర నాయకులు ఇప్పుడు రైతుల పేర నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. సన్న వడ్లకు బోనస్ ఇస్తామని 2020లో కెసిఆర్ ప్రకటించారని, ఆ తర్వాత మూడేళ్లు అధికారంలో ఉన్న నయా పైసా బోనస్ ఇయ్యలేదని, అందుకే కేసిఆర్ ను ఓడగొట్టి రైతులు ఇంట్లో కూర్చోబెట్టారన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమని, ఎక్కడ దుబార చేయకుండా కెసిఆర్ అస్తవ్యస్థం చేసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు. త్వరలో అన్ని హామీలను నిలబెట్టుకుంటామని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీల అమలు ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పామని , వాటిని ప్రారంభించి చూపించామన్నారు. వచ్చే ఎన్నికల నాటికి అన్ని హామీలను పూర్తి చేసి తీరుతామని, లేకుంటే ఓట్లే అడగం అని ప్రకటించారు. ఇప్పటికైనా బిఆర్‌ఎస్ నాయకులు తమ తప్పుడు ప్రకటనలు ఆపుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హితవు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News