Sunday, April 28, 2024

ఒకే రోజు 60 వేలకు పైగా పరీక్షలు

- Advertisement -
- Advertisement -

204 New Covid-19 Cases Reported in Telangana

కొత్తగా మరో 204 మందికి వైరస్, ఇద్దరు మృతి
జిహెచ్‌ఎంసి పరిధిలో 37, జిల్లాల్లో 167 మందికి పాజిటివ్
3,01,522కి చేరిన కరోనా బాధితుల సంఖ్య

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య భారీగా పెరిగింది. ఒకే రోజు ఏకంగా 60 వేలకు పైగా పరీక్షలు నిర్వహించడం గమనార్హం. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య92 లక్షల 99 వేల 245కి పెరిగింది. అంటే ప్రతి పది లక్షల్లో 2,49,845 మంది శాంపిల్స్‌ను పరీక్షించినట్లు హెల్త్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. రాబోయే రోజుల్లో రెట్టింపు స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా కొత్తగా మరో 204 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 37 ఆదిలాబాద్‌లో 8, భద్రాద్రి 5, జగిత్యాల 6, జనగాం 5, భూపాలపల్లి 3, గద్వాల 1, కామారెడ్డి 5, కరీంనగర్ 8,ఖమ్మం 7, ఆసిఫాబాద్ 3, మహబూబ్‌నగర్ 5, మహబూబాబాద్ 0, మంచిర్యాల 8, మెదక్ 2, మేడ్చల్ మల్కాజ్‌గిరి 14, ములుగు 1, నాగర్‌కర్నూల్ 5, నల్గొండ 8, నారాయణపేట్ 2, నిర్మల్ 5, నిజామాబాద్ 8, పెద్దపల్లి 4, సిరిసిల్లా 7, రంగారెడ్డి 12, సంగారెడ్డి 5, సిద్ధిపేట 5, సూర్యాపేట్ 6,వికారాబాద్ 4, వనపర్తి 2, వరంగల్ రూరల్ 2, వరంగల్ అర్బన్ లో 6, యాదాద్రిలో మరో ఐదుగురికి వైరస్ సోకింది.

అదే విధంగా వైరస్ దాడిలో మరో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 3,01,522కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,97,851 కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు తెలిపారు. మాస్కు, భౌతిక దూరం, శానిటేషన్‌తోనే వైరస్ నుంచి దూరంగా ఉండొచ్చని ఆయన అన్నారు. ముఖ్యంగా జనసమ్మర్ధ ప్రాంతాలు, మార్కెట్లలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు

204 New Covid-19 Cases Reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News