Thursday, May 2, 2024

76 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

- Advertisement -
- Advertisement -

214 new covid-19 cases reported in telangana

కొత్తగా మరో 214 మందికి వైరస్, ఇద్దరు మృతి
జిహెచ్‌ఎంసి పరిధిలో 38, జిల్లాల్లో 176 మందికి వైరస్
2,92,835 కి చేరిన కరోనా బాధితుల సంఖ్య

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 76 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 76 లక్షల రెండు వేల 975 మందికి టెస్టులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అంటే ప్రతి పది లక్షల్లో 2,04,271 మందికి పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా గురువారం 28,791 మందికి టెస్టులు చేయగా 214 మందికి పాజిటివ్ తేలింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 38 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 5, భద్రాద్రి 7,జగిత్యాల 8, జనగాం 4, భూపాలపల్లి 4, గద్వాల 0, కామారెడ్డి 0, కరీంనగర్ 14,ఖమ్మం 6 , ఆసిఫాబాద్ 5, మహబూబ్‌నగర్ 4, మహబూబాబాద్ 4, మంచిర్యాల 7, మెదక్ 4, మేడ్చల్ మల్కాజ్‌గిరి 14, ములుగు 3, నాగర్‌కర్నూల్ 0, నల్గొండ 8, నారాయణపేట్ 1, నిర్మల్ 5, నిజామాబాద్ 6, పెద్దపల్లి 7, సిరిసిల్లా 5, రంగారెడ్డి 14, సంగారెడ్డి 8, సిద్ధిపేట్ 7, సూర్యాపేట్ 4, వికారాబాద్ 7, వనపర్తి 0, వరంగల్ రూరల్ 3, వరంగల్ అర్బన్ లో 8, యాదాద్రిలో మరో నలుగురికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు.

దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,92,835కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,87,468కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు తెలిపారు. మాస్కు, భౌతిక దూరం, శానిటేషన్‌తోనే వైరస్ నుంచి దూరంగా ఉండొచ్చని ఆయన అన్నారు. ముఖ్యంగా జనసమ్మర్ధ ప్రాంతాలు, మార్కెట్లలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News