Saturday, April 27, 2024

కేరళలో జూన్ 9 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

- Advertisement -
- Advertisement -

23513 new covid-19 cases reported in kerala

తిరువంతపురం: కేరళలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా వస్తున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 1,41,759 మందికి పరీక్ష చేయగా, 23,513 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 198 మరణాలు సంభవించాయి. కరోనా నుంచి మరో 28,100 మంది బాధితులు కోలుకున్నారు. కేరళరాష్ట్రంలో ప్రస్తుతం 2,33,034 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కేరళవ్యాప్తంగా ఇప్పటివరకు 8,456 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో కేరళ సిఎం పినరయి విజయన్ ప్రకటించారు. అటు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా జూన్ 9 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు కేరళ సిఎం పినరయి పేర్కొన్నారు.

23513 new covid-19 cases reported in kerala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News