Wednesday, May 1, 2024

ఉప్పినంగడిలోని కళాశాలలో 24 మంది విద్యార్థినులు సస్పెండ్

- Advertisement -
- Advertisement -

Karnataka Hijab action

బెంగళూరు: రామచంద్రప్ప కమిటీ సిఫార్సు చేసిన అంశాలతో అంబేద్కర్, బసవన్న పాఠాలను పునర్ముద్రించాలని కర్నాటక విద్యాశాఖ నిర్ణయించింది. మరో వార్త ఏమిటంటే, ఉప్పినంగడిలోని ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కాలేజీకి చెందిన 24 మంది విద్యార్థినులు పదేపదే హెచ్చరించినప్పటికీ హిజాబ్ ధరించి తరగతికి వచ్చినందుకు వారిని శనివారం వరకు సస్పెండ్ చేశారు. గత వారం ఇదే విధమైన చర్య తర్వాత ఇలా మరోసారి జరిగింది. మంగళూరు యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న అదే కళాశాలలో హిజాబ్ ధరించి తరగతులకు హాజరైన నలుగురు బాలికలను సస్పెండ్ చేసింది. ఇదిలావుండగా కర్నాటకలో కొవిడ్-19 కేసులు పెరిగినందున మళ్లీ మాస్క్ తప్పనిసరి ధరించాలన్న నిబంధన విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News