Sunday, April 28, 2024

4 మండలాలకు దళితబంధు నిధులు

- Advertisement -
- Advertisement -

250cr released for 4 zones to Dalitbandhu

రూ.250కోట్లు విడుదల

మాట నిలబెట్టుకున్న సిఎం కెసిఆర్

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో దళితబంధు పథకం ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న నాలుగు మండలాలకు ఎస్‌సి కార్పొరేషన్ నిధులను విడుదల చేసింది. దళితబంధు పథకానికి ముందుగానే ప్రకటించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు నాలుగు జిల్లాలలోని నాలుగు మండలాలకు ఆయా జిల్లా కలెక్టర్ల ఖాతాల్లో మంగళవారం జమ చేసింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలంలో దళిత బంధును సంతృప్త స్థాయిలో అమలు చేసేందుకు రూ. 50 కోట్లు, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలానికి రూ.100 కోట్లు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని చారగొండ మండలానికి రూ. 50 కోట్లు, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలోని నిజాంసాగర్ మండలానికి రూ. 50 కోట్లను విడుదల చేశారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్ల ఖా తాల్లో తెలంగాణ షెడ్యూల్ కులాల ఫైనాన్స్ కార్పొరేషన్ జమ చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News