Thursday, May 2, 2024

ఎపిలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 2432 కేసులు, 44మంది మృతి

- Advertisement -
- Advertisement -

2524 New Corona Cases reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. దీంతో ప్రతిరోజూ రాష్ట్రంలో వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా రికార్డు స్థాయిలో 2432 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 44 మంది కరోనాతో చనిపోయారని తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 35,451కు చేరుకుంది.ఇక, కరోనాతో మరణించిన వారి సంఖ్య 452కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 16,621మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి 18,378 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

2524 New Corona Cases reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News