Wednesday, May 8, 2024

రాష్ట్రంలో కొత్తగా 2,707 కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

2707 Covid positive cases in Telangana

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 84,280 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,707 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,02,801కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. మొత్తం కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,328 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 4,049కు చేరింది. తాజాగా కరోనా నుంచి 582 మంది కోలుకోగా, ఇప్పటివరకు 6,78,290 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 96.51 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.57 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 20,462 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 10,026 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News