Thursday, May 2, 2024

ఎపిలో కొత్తగా 2,949 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

2949 New Corona Cases Registered in AP

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటీవ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 77,028 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 2,949 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,14,774కు చేరింది. కొత్తగా 18మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 6,643కి చేరింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇక, గడిచిన 24 గంటల్లో 3,609 మంది కోవిడ్‌ను జయించి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి 7,81,509 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26,622 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 77,73,681 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

2949 New Corona Cases Registered in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News