Wednesday, May 15, 2024

మేడ్చల్ లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు(సోమవారం) ఉదయం శామీర్ పెట్-కీసర రహదారిపై వేగంగా దూసుకొచ్చిన లారీ, టాటా ఎసిఈ, కారు ఒకదానికొకటి ఢీన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.

సమాచారం అందుకుని వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న మేడ్చల్ ట్రాఫిక్ సిఐ హనుమాన్ గౌడ్ స్థానికుల సాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్ం దవాఖానాకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News