Thursday, May 2, 2024

ఆగి ఉన్న టిప్పర్ ను ఢీకొట్టిన ఆటో: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

3 Members dead in Auto collided to tipper

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు వద్దో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న టిప్పర్‌ను ఆటో ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. ఈ ప్రమాదంలో మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కూలీలు పెడన నుంచి గుడ్లవల్లేరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులంతా ఒకే గ్రామానికి చెందిన వారిని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News