Sunday, April 28, 2024

వైసిపి ఎంఎల్ఎ వెంకట సుబ్బయ్య కన్నుమూత

- Advertisement -
- Advertisement -

YCP MLA Venkat subbaiah passes away
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం ఎంఎల్‌ఎ డా. వెంకట సుబ్బయ్య ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అస్వస్థతకు గురికావడంతో కడపలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అనారోగ్యంగా హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. అనంతరం కడపలో తన సొంతూరుకు వెళ్లాడు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం బాగానే చూశాడు. మళ్లీ అనారోగ్యం బారిన పడడంతో కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు సుబ్బయ్యను చేర్పించారు. ఎంఎల్‌ఎ మృతి పట్లు పలువురు ప్రముఖులు, వైసిపి కార్యకర్తలు సంతాపం తెలపడంతో పాటు ఆయన కుటుంబ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News