న్యూఢిల్లీ: దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. భారత్ లో గడిచిన 24గంటల్లో 312 మరణాలు, 14,933 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4లక్షల 40వేల 215కు చేరుకుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 14,011 మంది కరోనాతో చనిపోయారు. ప్రస్తుతం భారత్ లో 1,78,014 యాక్టివ్ కేసులున్నాయి. 2,48,190 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
అటు తెలుగురాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,35,796 మందికి కరోనా వైరస్ సోకింది. ఇప్పటివరకు 6,283 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం 61,807 మంది కోవిడ్ చికిత్స పొందుతుండగా… 67,706 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. 62,655 మంది కరోనా బారినపడగా… 2,233 మందిని కరోనా కబలించింది. తమిళనాడులో ఇప్పటివరకు 59,377 మందికి కోవిడ్ సోకగా…757మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్ తో 27,880 మందికి కరోనా మహమ్మారి సోకగా…1,685 మంది చనిపోయారు.
312 deaths and 14933 new COVID 19 cases in India