- Advertisement -
హైదరాబాద్: నగరంలోని నాంపల్లిలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ప్రతిక్ ఫర్నీచర్ షాపులో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
- Advertisement -