- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 355 కోవిడ్-19 కేసులు మరో ఇద్దరు ఈ వైరస్ తో మృతి చెందారు. అదే సమయంలో 354 మంది కోలుకున్నారు. ఎపిలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,80,430కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 7,091 మంది కరోనాతో చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,861 యాక్టివ్ కేసులుండగా… 8,69,478 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు ఎపిలో 1,15,31,206 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఎపి వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.
- Advertisement -