- Advertisement -
యావుండే: మధ్య ఆఫ్రికా దేశం కామెరూన్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 37మంది చనిపోగా, 18మంది తీవ్రంగా గాయపడ్డారు. కామెరూన్ పశ్చిమ ప్రాంతంలోని నెమాలే అనే గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఫౌంబన్ పట్టణం నుంచి 70మందితో రాజధాని నగరం యావుండే వైపు వెళ్తున్న బస్సు రోడ్డుపై గుంపుగా ఉన్న జనాన్ని తప్పించబోయి ట్రక్కుకు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్నవారంతా క్రిస్మస్ సంబరాల కోసం వెళ్తున్నారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నదన్నారు. ఘటన గురించి తెలుసుకున్న గ్రామస్తులు ప్రమాద స్థలానికి చేరుకొని బాధితులకు సహాయక చర్యలు చేపడుతున్నారు.
37 killed in road accident at Cameroon
- Advertisement -