Tuesday, May 7, 2024

71 లక్షలు దాటిన కరోనా టెస్టులు

- Advertisement -
- Advertisement -

417 New Covid-19 Cases Reported in Telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 71 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 71 లక్షల 4 వేల 367 మందికి పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ హెల్త్ బులెటెన్‌లో పేర్కొంది. అంటే ప్రతి పది లక్షల్లో లక్షా 90 వేల 874 మందికి పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను మరింత రెట్టింపు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా మంగళవారం 43,318 మందికి టెస్టులు చేయగా 417 మందికి వైరస్ సోకింది.

వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 82 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 10, భద్రాద్రి 11,జగిత్యాల 10, జనగాం 7, భూపాలపల్లి 5, గద్వాల 7, కామారెడ్డి 10, కరీంనగర్ 24 ,ఖమ్మం 10, ఆసిఫాబాద్ 2, మహబూబ్‌నగర్ 8,మహబూబాబాద్ 8, మంచిర్యాల 12, మెదక్ 5, మేడ్చల్ మల్కాజ్‌గిరి 32, ములుగు 7, నాగర్‌కర్నూల్ 9, నల్గొండ 11, నారాయణపేట్ 0, నిర్మల్ 5, నిజామాబాద్ 11, పెద్దపల్లి 8, సిరిసిల్లా 7, రంగారెడ్డి 34, సంగారెడ్డి 19, సిద్ధిపేట్ 11, సూర్యాపేట్ 9, వికారాబాద్ 8, వనపర్తి 4, వరంగల్ రూరల్ 7, వరంగల్ అర్బన్ లో 13, యాదాద్రిలో మరో 11మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,88,410కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,81,872కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

పాజిటివ్ తేలినవాళ్లల్లో 2 లక్షల మంది అసింప్టమాటిక్ పేషెంట్లే….

రాష్ట్రంలో వైరస్ సోకిన వాళ్లల్లో 2 లక్షల 1887 మంది అసింప్టమాటిక్ పేషెంట్లు ఉన్నట్లు హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. అంటే ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర వైరస్ తీవ్రత అతి తక్కువగా తేలుతుందని అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News