Thursday, May 2, 2024

మళ్లీ వెయ్యిదాటిన కరోనా మరణాలు

- Advertisement -
- Advertisement -

42766 new covid-19 cases reported in india

42,766 పాజిటివ్‌లు
37 కోట్లు మార్కును దాటిన టీకా డోసుల పంపిణీ
97.20 శాతానికి పెరిగిన రికవరీ రేటు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కేసులు, మరణాలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా గడచిన 24 గంటల్లో 42,766 మందికి వైరస్ సోకింది. క్రితం రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గింది. అయితే గత కొన్ని రోజులుగా వెయ్యికన్నా తక్కువ నమోదవుతున్న మరణాలు శుక్రవారం భారీగా పెరిగాయి. తాజాగా 1206 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,07,95, 716కు చేరుకోగా, మరణాలు 4,07,145కు చేరుకున్నాయి. తాజా మరణాల్లో మహారాష్ట్రలో 738 మంది మరణించగా, కేరళలో 130 మంది, కర్నాటకలో 68 మంది చనిపోయారు.

శుక్రవారం మొత్త 19,55,225 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక గడచిన 24 గంటల్లో 45,254 మంది వైరస్‌నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీలు 2,99,33,538కు చేరుకోగా, రికవరీ రేటు 97.20కు చేరుకుంది. ప్రస్తుతం 4,55,033 మంది వైరస్‌తో బాధపడుతుండగా, యాక్టివ్ రేటు 1.48 శాతానికి తగ్గింది. మరో వైపు రోజువారీ పాజిటివిటీ రేటు 2.19 శాతానికి చేరింది. పాజిటివిటీ రేటు 5 శాతానికన్నా తక్కువగా ఉండడం వరసగా ఇది 19వ రోజు. మరోపక్క శుక్రవారం నాడు 30,55,033 మంది టీకాలు తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 37 కోట్ల మార్కును దాటింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News