- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటివరకు 50 శాతం రేషన్ పంపిణీ పూర్తి చేశామని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మారెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందొద్దని, ఈ నెల 31వ తేదీ వరకు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. సర్వర్ సమస్య రాకుండా… సర్వర్ స్పీడ్ని మూడు రెట్లు పెంచుతామని, వలస కార్మికులకు రెవెన్యూ విభాగం ద్వారా బియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. రేషన్ పంపిణీలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
50% Ration rice distribute in Telangana says reddy
50% Ration rice distribute in Telangana
- Advertisement -