Sunday, May 5, 2024

66 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

- Advertisement -
- Advertisement -

574 new Covid-19 Cases Reported in Telangana

జిహెచ్‌ఎంసి పరిధిలో 109, జిల్లాల్లో 465 మందికి వైరస్
2,83,556కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 66 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల 11 వేల 118 మందికి పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ నివేదికను విడుదల చేసింది. అంటే ప్రతి పది లక్షల్లో లక్షా 77 వేల 622 మందికి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను మరింత పెంచనున్నట్లు వైద్యశాఖ పేర్కొంది. మరోవైపు ప్రతి రోజు చేసే టెస్టుల్లో 44 శాతం మంది ప్రైమరీ , 12 శాతం సెకండరీ కాంటాక్ట్‌లకు టెస్టులు చేస్తున్నామని వైద్యశాఖ వెల్లడించింది. అంతేగాక ప్రతి రోజు ప్రభుత్వ టెస్టింగ్ కేంద్రాల్లోనే 97 శాతం పరీక్షలు నిర్వహిస్తుండగా, కేవలం 3 శాతం మంది మాత్రమే ప్రైవేట్ కేంద్రాలకు వెళ్తున్నట్లు వైద్యశాఖ హెల్త్ బులెటెన్‌లో పేర్కొంది. ఇదిలా ఉండగా గురువారం 44,516 మందికి టెస్టులు చేయగా 574 మందికి వైరస్ సోకింది.

వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 109 మంది ఉండగా, ఆదిలాబాద్‌లో 8, భద్రాద్రి 22, జగిత్యాల 12, జనగాం 11, భూపాలపల్లి 8, గద్వాల 3, కామారెడ్డి 9, కరీంనగర్ 30,ఖమ్మం 25, ఆసిఫాబాద్ 6, మహబూబ్‌నగర్ 7, మహబూబాబాద్ 12, మంచిర్యాల 17, మెదక్ 8, మేడ్చల్ మల్కాజ్‌గిరి 42, ములుగు 11, నాగర్‌కర్నూల్ 12, నల్గొండ 22, నారాయణపేట్ 0, నిర్మల్ 4, నిజామాబాద్ 11, పెద్దపల్లి 16, సిరిసిల్లా 10, రంగారెడ్డి 48, సంగారెడ్డి 24, సిద్ధిపేట్ 12, సూర్యాపేట్ 10, వికారాబాద్ 4, వనపర్తి 3, వరంగల్ రూరల్ 13, వరంగల్ అర్బన్ లో34, యాదాద్రిలో మరో 11 మందికి వైరస్ సోకింది. అదే విధంగా వైరస్ దాడిలో మరో ముగ్గురు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,83,556 కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,75,217కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News