Monday, April 29, 2024

భారత్‌తో చర్చలు సాధ్యం కావు

- Advertisement -
- Advertisement -

Negotiations with India are not possible: Pakistan foreign minister

 

పాక్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు

ఇస్లామాబాద్: ప్రస్తుత పరిస్థితులలో భారత్‌తో దౌత్యపరమైన చర్చలు సాధ్యం కావని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి తెలిపారు. ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితులలో భారత్‌తో పరోక్ష లేదా ప్రత్యక్ష దౌత్యపరమైన చర్చలకు ఆస్కారం లేదని, ప్రస్తుతం ఏ విధమైన చర్చలకు పరిస్థితులు అనుకూలంగా లేవని బుధవారం తన స్వస్థలం ముల్తాన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఖురేషీ వ్యాఖ్యానించినట్లు డాన్ పత్రిక తెలిపింది. చర్చలు, ఉగ్రవాదం కలసికట్టుగా పయనించలేవన్న తన వాదాన్ని భారత్ గతంలోనే స్పష్టం చేసింది. భారత్‌పై జరిగిన వేర్వేరు దాడులకు బాధ్యులైన ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ కఠిన చర్చలు తీసుకునేంతవరకు ఆ దేశంతో చర్చలు జరిపే ప్రసక్తి లేదని భారత ప్రభుత్వం ఇదివరకే తేల్చిచెప్పింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News