Saturday, April 27, 2024

తెలంగాణలో కొత్తగా 578 పాజిటీవ్ కేసులు..

- Advertisement -
- Advertisement -

578 New Corona Cases Reported in Telangana

హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 578 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా రాష్ట్రంలో మరో ముగ్గురు బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 6,36,627కు పెరిగగా, మొత్తం మరణాల సంఖ్య 3,759కు పెరిగింది. గత 24 గంటల్లో 731మంది బాధితులు చికిత్సకు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు 6,23,044 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,824 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

578 New Corona Cases Reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News